Sunday, May 17, 2009

లోక్ సత్తా తొలి విజయం...




జె.పి. ని గెలిపించినందుకు కూకట్ పల్లి ప్రజలను అభినందించాలి. జె.పి. అసెంబ్లీ లో ఆంధ్ర రాజకీయాల్లో తనదైన ముద్రను వేస్తారని ఆశిద్దాం..మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఈ పార్టికి మరిన్ని సీట్లు వస్తాయని నాకు ఖచ్చితమైన నమ్మకం వుంది.

ఎన్నికలు ముగిశాయ్...

ఈ ఎన్నికల్లో చాలా విభిన్నంగా తమ మద్దతును కాంగ్రెస్ కు తెలిపారు..ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం...

ప్రతిసారి కేంద్రంలో ప్రభుత్వం.. ఎవరో ఒకరి చేతిలో కీలుబొమ్మ కావడం.. ప్రతి నిర్ణయాన్ని తీసుకోవడానికి తగిన మెజార్టీ లేక తంటాలు పడుతూ వుండేది.

జయలలిత, లాలు, మాయావతి, లెఫ్ట్ పార్టీల మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతోందంటే నిజంగానే ప్రజల ఆలోచనా శక్తి కి అద్దం పడుతోంది.మరీ ఆంధ్రప్రదేశ్ ఫలితాలను చూస్తే ఆ విషయం మరింత ప్రస్పుటంగా కనిపిస్తుంది.
కెసిఆర్ పీడ ఆంధ్రప్రదేశ్ కు విరగడైనందుకు ఒకసారి అందరూ దీపావళి జరుపుకోవచ్చు. మరో ఐదేళ్ళు ప్రశాంతంగా వుండొచ్చు.

avandia